Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ టీవీకి మరో షాక్ : టీఆర్పీ తారుమారు కేసులో మరొకరి అరెస్టు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (12:43 IST)
జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీకి మరో షాక్ తగిలింది. టీఆర్పీ రేటింగ్‌ను తారుమారు చేశారన్న ఆరోపణల కేసులో ఆ చానల్ డిస్టిబ్యూషన్ విభాగం అధిపతి ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 
 
టీఆర్పీ రేటింగ్స్ ను తారుమారు చేశారంటూ అందిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. టీఆర్పీ అవకతవలకు సంబంధించి తాజా అరెస్టును కలిపితే... ఇప్పటివరకు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
రిపబ్లిక్ టీవీపై కొందరు వీక్షకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. తాము టీవీ చూడకపోయినా... రిపబ్లిక్ టీవీని ఆన్ చేసి పెట్టుకుంటే తమకు డబ్బులు చెల్లిస్తారని వారు చెప్పడంతో... మీడియా ప్రపంచంలో అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. 
 
దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఆ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని మాత్రం ఓ ఇంటీరియల్ డిజైనర్, ఆయన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేశారన్న కేసులో అరెస్టు చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments