Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ టీవీకి మరో షాక్ : టీఆర్పీ తారుమారు కేసులో మరొకరి అరెస్టు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (12:43 IST)
జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీకి మరో షాక్ తగిలింది. టీఆర్పీ రేటింగ్‌ను తారుమారు చేశారన్న ఆరోపణల కేసులో ఆ చానల్ డిస్టిబ్యూషన్ విభాగం అధిపతి ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 
 
టీఆర్పీ రేటింగ్స్ ను తారుమారు చేశారంటూ అందిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. టీఆర్పీ అవకతవలకు సంబంధించి తాజా అరెస్టును కలిపితే... ఇప్పటివరకు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
రిపబ్లిక్ టీవీపై కొందరు వీక్షకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. తాము టీవీ చూడకపోయినా... రిపబ్లిక్ టీవీని ఆన్ చేసి పెట్టుకుంటే తమకు డబ్బులు చెల్లిస్తారని వారు చెప్పడంతో... మీడియా ప్రపంచంలో అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. 
 
దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఆ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని మాత్రం ఓ ఇంటీరియల్ డిజైనర్, ఆయన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేశారన్న కేసులో అరెస్టు చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments