Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వు లేక నేను లేను' : ఆమెను వదిలివుండలేక యువకుడు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉండలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి విషం సేవించినప్పటికీ.. ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ప్రియురాలు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని తెల్లరాళ్లపల్లెకు చెందిన దిలీప్‌ కుమార్‌(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో భార్యను గట్టిగా మందలించాడు. అయినప్పటకీ.. వారిద్దరి మధ్య బంధం కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో మరోమారు భార్యను భర్త హెచ్చరించాడు. ఈ క్రమంలో ఒకరివదిలి మరొకరు ఉండలేని వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం గ్రామం నుంచి కనిపించకుండా పోయారు. మండలంలోని దొనిరేవులపల్లెకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో విషం సేవించి స్పృహ కోల్పోయారు. 
 
సాయంత్రం ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. దిలీప్‌ అప్పటికే చనిపోయాడు. ఇంతలో వారి బంధువులు గాలిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చీలాపల్లె సీయంసీకి తరలించడంతో కోలుకుంది. చిత్తూరులో పోస్టుమార్టం అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని సోమవారం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments