Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు.. ముంబై, మెదక్‌‍లో?

ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఆ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వెళుతున్నాడు. ఓ లోకల్‌ ట్రైన్‌ అతడి వెనుక నుంచి వస్తోంది. ఈ విషయ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (15:22 IST)
ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఆ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వెళుతున్నాడు. ఓ లోకల్‌ ట్రైన్‌ అతడి వెనుక నుంచి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించి ఆ వ్యక్తి ఒక్కసారిగా ట్రైన్‌ ముందుకు దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ వీడియో తీసి బంధువులకు పంపించాడు. సిద్దిపేట కనకదుర్గ కాలనీకి చెందిన కనకరాజు.. తన బావమరుదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని అందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 
 
కనకరాజు భార్య ఇటీవల మృతి చెందింది. దీనికి కనకరాజు కారణమంటూ ఇటీవల ఆయన బావమరుదులు దాడి చేసినట్టు తెలిసింది. ఈక్రమంలో వారు మరోసారి దాడిచేస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో కనకరాజు చెప్పాడు. అత్తగారింటి నుంచి వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్‌లోనూ సెల్ఫీలోనూ కనకరాజు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments