జగన్‌కే అంతా అనుకూలం.. పవన్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేం: ఉండవల్లి

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆర్జీ ఫ్లాష్‌ టీమ్ నిర్వహించే సర్వేలకు తిరుగుండదు. ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేకు ఉన్న ట్రాక్‌ రికార్డు.. వందకు వందశాతం సక్సెస్‌ రేటును కలిగివుంది. ఎప్పటికప్పుడు ప్రజ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (13:24 IST)
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆర్జీ ఫ్లాష్‌ టీమ్ నిర్వహించే సర్వేలకు తిరుగుండదు. ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేకు ఉన్న ట్రాక్‌ రికార్డు.. వందకు వందశాతం సక్సెస్‌ రేటును కలిగివుంది. ఎప్పటికప్పుడు ప్రజలనాడిని అందిపుచ్చుకోవడంలో ముందుంటుందనే నమ్మకాన్ని సంపాదించుకుంది.. అందుకే ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ డిసైడ్‌ చేస్తే ముందే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందనే నానుడి రాజకీయ వర్గాల్లో ఉంది.
 
ఇక ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 110 సీట్లు లభిస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి 60 సీట్లు మాత్రమే దక్కనున్నాయని తేల్చి చెప్పింది. జనసేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేల్చి చెప్పింది. 
 
తాజాగా ఏపీలో రాజకీయ బలాబలాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పుడు ప్రజల్లో వేవ్ వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందన్నారు. 
 
అయితే ప్రజల్లో ఉన్న వేవ్‌ను మార్చగలిగే సామర్థ్యం సీఎం చంద్రబాబుకు ఉందని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.. వైఎస్ జగన్‌‍కు సరైన ఎన్నికల టీమ్ లేదని వెల్లడించిన ఉండవల్లి... పవన్ కళ్యాణ్ బలంపై ఇప్పుడే ఓ అంచనా వేయలేమని చెప్పుకొచ్చారు. అయితే వైకాపా చీఫ్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిపోతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది చెప్పలేమని ఉండవల్లి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments