Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి ముంబైలో లోకల్ ట్రైన్స్.. స్పెషల్ పాస్ ఉన్నవారికే ఎంట్రీ

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (05:58 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా నిలిపివేసివున్న ముంబై లోకల్ ట్రైన్స్ ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే స్పెషల్ రైల్వే పాస్ పొందాల్సివుంటుంది. అలాగే, క‌రోనా నియంత్ర‌ణ‌కు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మాత్రమే లోక‌ల్ ట్రైన్ల‌లో ప్ర‌యాణించొచ్చు. 
 
కానీ, రెండో డోస్ వేయించుకున్న తర్వాత 14 రోజుల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా స్థానిక వార్డు కార్యాల‌యాల్లో స్పెష‌ల్ రైల్వే పాస్ పొందాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారు ఆఫ్‌లైన్‌లో పాస్ తీసుకోవాలి.
 
కాగా, మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రెండో వేవ్ తారా స్థాయికి చేరుకోవ‌డంతో గ‌త ఏప్రిల్ నుంచి స‌బ‌ర్బ‌న్ లోక‌ల్ రైళ్ల‌లో సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి నిలిపేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వోద్యోగులు, అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల ఉద్యోగులు మాత్ర‌మే లోక‌ల్ రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ముంబైలో 19 ల‌క్ష‌ల మందికి పూర్తిగా వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments