Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి ముంబైలో లోకల్ ట్రైన్స్.. స్పెషల్ పాస్ ఉన్నవారికే ఎంట్రీ

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (05:58 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా నిలిపివేసివున్న ముంబై లోకల్ ట్రైన్స్ ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే స్పెషల్ రైల్వే పాస్ పొందాల్సివుంటుంది. అలాగే, క‌రోనా నియంత్ర‌ణ‌కు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మాత్రమే లోక‌ల్ ట్రైన్ల‌లో ప్ర‌యాణించొచ్చు. 
 
కానీ, రెండో డోస్ వేయించుకున్న తర్వాత 14 రోజుల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా స్థానిక వార్డు కార్యాల‌యాల్లో స్పెష‌ల్ రైల్వే పాస్ పొందాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారు ఆఫ్‌లైన్‌లో పాస్ తీసుకోవాలి.
 
కాగా, మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రెండో వేవ్ తారా స్థాయికి చేరుకోవ‌డంతో గ‌త ఏప్రిల్ నుంచి స‌బ‌ర్బ‌న్ లోక‌ల్ రైళ్ల‌లో సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి నిలిపేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వోద్యోగులు, అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల ఉద్యోగులు మాత్ర‌మే లోక‌ల్ రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ముంబైలో 19 ల‌క్ష‌ల మందికి పూర్తిగా వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments