ప్రాణం కోసం వాకింగ్ స్టిక్‌తో చిరుతతో పోరాడిన మహిళ

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:07 IST)
క్రూర జంతువుల బారినపడినపుడు తల్లిదండ్రులు తమ ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా పోరాటం చేస్తారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడరు. తాజాగా ఓ మహిళ ఒంటరిగా కూర్చొనివుండగా, ఓ చిరుత దాడిచేసేందుకు యత్నించింది. వాకింగ్ స్టిక్‌తో దానితో పోరాడింది. 
 
ముంబైలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబై ఆరే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే చిరుత రెండోసారి దాడిచేయడం గమనార్హం. 
 
ఆరే డెయిరీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల్లో తొలుత చిరుతపులి నడుచుకుంటూ రావడం.. ఓ నిమిషం తర్వాత ఓ మహిళ ఊతకర్ర పట్టుకుని మెల్లగా నడిచి వస్తోంది.
 
నిర్మలా దేవి సింగ్ (55) అనే మహిళ అక్కడే ఉన్న అరుగులా ఉన్న ఓ గోడపై కూర్చుని ఉండగా.. చిరుత ఆమెపై దూసుకొస్తోంది. దీనిని గమనించి ఆ మహిళ తన ఊతకర్ర సాయంతో చిరుతను ఎదుర్కొని పక్కకు తోసేసింది. 
 
ఈ క్రమంలో నిర్మలా దేవి సింగ్ గొడపై నుంచి కింద పడిపోయింది. అయినా సరే ఊత కర్రతో చిరుతను అదిలించడంతో ఆ అడవి జంతువు వెనక్కు తగ్గింది. ఇంతలో ఆమె సాయం కోసం భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. దీంతో చిరుత అక్కడ నుంచి పారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments