Webdunia - Bharat's app for daily news and videos

Install App

యు ఆర్ ది బాంబర్ అంటూ ప్రియురాలు చాటింగ్.. 6 గంటలు నిలిచిపోయిన ఫ్లైట్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:57 IST)
ఓ విమానం ఏకంగా ఆరు గంటల పాటు నిలిచిపోయింది. ఆ విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు తన ప్రియురాలితో చాటింగ్ మొదలుపెట్టాడు. ఈ చాటింగ్‌లో ప్రియురాలు.. తన ప్రియుడిని ఉద్దేశించి "యు ఆర్ ది బాంబర్" అంటూ టెక్స్ట్ పంపింది. దాన్ని పక్కసీటులోని ప్రయాణికుడు చూసి విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంత అప్రమత్తమైన సిబ్బంది.. విమాన ప్రయాణికులందర్నీ కిందికి దించేసి విమానాన్ని నిశితంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తన ప్రియురాలు, తాను ఫ్రెండ్లీ చాటింగ్ చేసుకుంటున్నామని ప్రయాణికుడు చెప్పాడు. మొత్తంగా ఆరు గంటల ఆలస్యం తర్వాత విమానం గమ్యస్థానానికి బయలుదేరింది. మంగుళూరు నుంచి ముంబైకు వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్‌ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. 
 
అందులో 'యు ఆర్ ద బాంబర్' అన్న మెసేజ్ కనిపించింది. అంతే వెంటనే కీడు శంకించిన ఆమె విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన కేబిన్ సిబ్బంది దానిని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో విమానం టేకాఫ్ ఆగిపోయింది. 
 
ఆ తర్వాత విమానంలోని 185 మంది ప్రయాణికులను కిందికి దించేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, అందులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరోవైపు, చాటింగ్ చేసిన యువకుడిని, అదే విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్న అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. వారి సంభాషణ సరదాగా సాగిందని తేలడంతో విమానం బయలుదేరేందుకు అధికారులు అనుమతినిచ్చారు. 
 
దాదాపు ఆరుగంటలపాటు నిలిచిపోయిన విమానం చివరికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అయితే, విచారణ జరుగుతున్న నేపథ్యంలో యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు, అలాగే అతడి ప్రియురాలు కూడా బెంగళూరు వెళ్లే విమానాన్ని మిస్సైంది. కాగా, వారిద్దరి మధ్య జరిగింది ఫ్రెండ్లీ చాటింగేనని, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments