Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఎంపాక్స్ కేసు.. యూఏఈ నుంచి వ్యక్తికి పాజిటివ్

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (09:06 IST)
దేశంలో మరో మంకీ పాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైంది. యూఏఈ నుంచి వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇది దేశంలో నమోదైన రెండో కేసు కావడం గమనార్హం. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఈ కేసు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడు ఇప్పటికే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. 38 యేళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణలు కనిపించడంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించగా, పాజిటివ్‌గా తేలినట్టు చెప్పారు. 
 
విదేశాల నుంచి వచ్చే వారితో సహా ఏవైనా లక్షణాలు ఉన్నవారు తమకు సమాచారం అందించి, సాధ్యమైనంత త్వరగా చికిత్సను పొందాలని సూచించారు. యూఏఈ నుంచి వచ్చిన సదరు వ్యక్తి కూడా తనకు వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించాడని, అతను తన కుటుంబానికి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు. ఆయన ప్రస్తుతం మంజేరిల వైద్య కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments