Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రయాన్‌-4 మిషన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 నాటికి...?

Chandrayan

సెల్వి

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (18:47 IST)
చంద్రయాన్‌-4 మిషన్‌, గగన్‌యాన్‌, వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, ఎన్‌జీఎల్‌ఏ వాహకనౌక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇస్రో పంపిన ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్‌ చంద్రయాన్‌-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని చెప్పారు.

ఈ ప్రాజెక్టులు చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రో 2026 నాటికి చేపట్టాలని భావిస్తుంది. రెండు దశల్లో చంద్రయాన్‌-4 మిషన్‌ను నిర్వహిస్తుంది.

ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నారు. మిషన్‌లో భాగంగా చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించి.. తిరిగి భూమిపైకి చేరుకుంటుంది. ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్‌ చరిత్ర లిఖించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీకి బిగ్ షాక్ : ప్రాథమిక సభ్యత్వానికి బాలినేని రాజీనామా.. రేపు పవన్‌తో భేటీ!