Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తపై అలిగి మేనమాన ఇంటికెళ్లిన మహిళ... చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టారు..

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (15:24 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. భర్తపై అలిగి మేనమామ ఇంటికి వెళ్లిన ఓ మహిళను ఆమె తండ్రి, సోదరులే అత్యంత దారుణంగా అవమానించారు. అందరూ చూస్తుండగా ఘోరంగా శిక్షించారు. ఆమెను చితకబాదారు. తాళ్లతో చెట్టుకు వేలాడదీసి చావబాదారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని అలిరాజా‌పూర్ అనే ఓ గిరిజన గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూడు నెలల క్రితం పెండ్లి చేసుకున్న 19 ఏళ్ల వధువు భర్తపై అలిగి పుట్టింటికి వచ్చేసింది. అక్కడ నుంచి తన మేనమామ ఊరికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఘోరంగా శిక్షించారు. 
 
మేనమామ ఇంట్లో నుంచి జట్టు పట్టుకుని బైటకు లాక్కొచ్చారు. ఆమెను కింద పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. అనంతరం కర్రలతో ఆమెను కొట్టారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ ఘటన గురించి దర్యాఫ్తు చేసి ఆ మహిళ తండ్రి, సోదరులను అరెస్ట్ చేశారు. 
 
దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడి ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments