Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తపై అలిగి మేనమాన ఇంటికెళ్లిన మహిళ... చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టారు..

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (15:24 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. భర్తపై అలిగి మేనమామ ఇంటికి వెళ్లిన ఓ మహిళను ఆమె తండ్రి, సోదరులే అత్యంత దారుణంగా అవమానించారు. అందరూ చూస్తుండగా ఘోరంగా శిక్షించారు. ఆమెను చితకబాదారు. తాళ్లతో చెట్టుకు వేలాడదీసి చావబాదారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని అలిరాజా‌పూర్ అనే ఓ గిరిజన గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూడు నెలల క్రితం పెండ్లి చేసుకున్న 19 ఏళ్ల వధువు భర్తపై అలిగి పుట్టింటికి వచ్చేసింది. అక్కడ నుంచి తన మేనమామ ఊరికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఘోరంగా శిక్షించారు. 
 
మేనమామ ఇంట్లో నుంచి జట్టు పట్టుకుని బైటకు లాక్కొచ్చారు. ఆమెను కింద పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. అనంతరం కర్రలతో ఆమెను కొట్టారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ ఘటన గురించి దర్యాఫ్తు చేసి ఆ మహిళ తండ్రి, సోదరులను అరెస్ట్ చేశారు. 
 
దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడి ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments