భర్తపై అలిగి మేనమాన ఇంటికెళ్లిన మహిళ... చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టారు..

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (15:24 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. భర్తపై అలిగి మేనమామ ఇంటికి వెళ్లిన ఓ మహిళను ఆమె తండ్రి, సోదరులే అత్యంత దారుణంగా అవమానించారు. అందరూ చూస్తుండగా ఘోరంగా శిక్షించారు. ఆమెను చితకబాదారు. తాళ్లతో చెట్టుకు వేలాడదీసి చావబాదారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని అలిరాజా‌పూర్ అనే ఓ గిరిజన గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూడు నెలల క్రితం పెండ్లి చేసుకున్న 19 ఏళ్ల వధువు భర్తపై అలిగి పుట్టింటికి వచ్చేసింది. అక్కడ నుంచి తన మేనమామ ఊరికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఘోరంగా శిక్షించారు. 
 
మేనమామ ఇంట్లో నుంచి జట్టు పట్టుకుని బైటకు లాక్కొచ్చారు. ఆమెను కింద పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. అనంతరం కర్రలతో ఆమెను కొట్టారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ ఘటన గురించి దర్యాఫ్తు చేసి ఆ మహిళ తండ్రి, సోదరులను అరెస్ట్ చేశారు. 
 
దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడి ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments