Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఓ ఎంపీ.. ఆయన ఇద్దరు కుమారులు మృతి!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (08:42 IST)
అనేక కుటుంబాల్లో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏకంగా కుటుంబంలోని సభ్యులందరినీ మింగేస్తూ తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ క్రమంలో తాజాగా ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర (78) కూడా కరోనాతో ప్రాణాలు విడిచారు. 
 
ఇక్కడ మరింత విషాదం ఏమిటంటే ఆయన ఇద్దరు కుమారులు కూడా కొన్నిరోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. మహాపాత్ర ఈ నెల 9న మరణించారు. గత నెల 22న ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన మరిక కోలుకోలేకపోయారు.
 
ఆ తర్వాత మహాపాత్ర కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వీరిద్దరినీ ఎయిమ్స్‌‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రశాంత గురువారం కన్నుమూయగా, పెద్దవాడైన జశోబంత శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.
 
రఘునాథ్ మహాపాత్ర గొప్ప శిల్పిగా ఖ్యాతి పొందారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఇక, ఆయన కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన, ఇద్దరు కుమారుల మరణంతో ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments