Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చేతిని నరికిన కసాయి.. పెళ్లైన రెండు నెలలకే ఘాతుకం..!

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (13:32 IST)
ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా కసాయిలా చేతిని నరికాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. అనుమానం పెనుభూతమై పెళ్లైన రెండు నెలలకే భార్య చేతులు నరకడంతో బాధితురాలిని భోపాల్‌లోని హమిదియ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు తొమ్మిది గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించి ఆమె చేతులను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
 
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రణ్‌ధీర్‌ సోమవారం కట్టెలు తీసుకురావాలనే సాకుతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో రణ్‌ధీర్‌ గొడ్డలితో తన భార్య చేతులను నరికి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని నిందితుడు కేవలం రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
పెళైన పదిహేను రోజులకే భర్త తనను అనుమానంతో వేధించేవాడని, ఎవరితో మాట్లాడినా అభ్యంతరం తెలిపేవాడని బాధితురాలు పేర్కొన్నారు. మరోవైపు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం బాధితురాలికి ఆమె మామ సంరక్షకులుగా ఉన్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments