మధ్యప్రదేశ్‌ బీటీఆర్‌లో 48 గంటల్లో 8 ఏనుగులు మృతి ఎలా?

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (12:50 IST)
Elephant
మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లా పరిధిలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (బిటిఆర్)లో గత 48 గంటల్లో ఎనిమిది అడవి ఏనుగులు అనుమానాస్పద విషప్రయోగం కారణంగా మరణించాయని అధికారులు తెలిపారు. మరో ఏనుగు తీవ్ర అస్వస్థతకు గురై పశువైద్యులచే చికిత్స పొందుతున్నట్లు సీనియర్ అటవీ అధికారి తెలిపారు. బీటీఆర్‌లో ఎనిమిది ఏనుగులు చనిపోయాయి (గత 48 గంటల్లో).. మరో ఏనుగు చికిత్స పొందుతోంది. మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదికల్లో తేలుస్తాం" అని అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏపీసీసీఎఫ్) (వన్యప్రాణి) ఎల్ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. 
 
ఇకపోతే.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఈ సంఘటనపై విచారణ కోసం అటవీ అధికారుల బృందాన్ని బీటీఆర్‌కు పంపింది. అంతేకాకుండా, ఈ సంఘటనపై విడిగా దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బుధవారం సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు వర్గాలు తెలిపాయి. 
 
ఎనిమిది మంది వెటర్నరీ డాక్టర్ల బృందం చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహిస్తోంది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు 300 బస్తాల ఉప్పును ఆర్డర్ చేశాం. ఇందుకోసం గుంతలు తవ్వేందుకు రెండు జేసీబీ యంత్రాలను వినియోగించనున్నట్టు బీటీఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పీకే వర్మ బుధవారం విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments