కేరళ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందట...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:54 IST)
కేరళ రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. మన దేశంలోని కమ్యూనిస్టులు హిందూ సంప్రదాయాలను గౌరవించరని వ్యాఖ్యానించారు. ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోడీ... వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శబరిమల విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం.. చరిత్రలో నిలిచిపోయే సిగ్గుమాలిన రాజకీయం చేస్తోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఏ ప్రభుత్వం, పార్టీ ఈ రకంగా వ్యవహరించలేదన్నారు. కమ్యూనిస్టులు భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించరని తెలుసు గానీ.. ఇంతటి ద్వేషం కలిగి ఉంటారని ఊహించలేదని మోడీ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ప్రతీ భారతీయుడు కులం, మతం అనే తేడా లేకుండా.. ఈ రిజర్వేషన్లు పొందుతారన్నారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మోడీ.. అక్కడే స్వదేశీ దర్శన్ స్కీంను ప్రారంభించారు. రూ.1550 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహంతో ఉందని మోడీ విమర్శించారు. పేదల డబ్బు దోచుకున్న ఎవ్వరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments