Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందట...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:54 IST)
కేరళ రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. మన దేశంలోని కమ్యూనిస్టులు హిందూ సంప్రదాయాలను గౌరవించరని వ్యాఖ్యానించారు. ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోడీ... వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శబరిమల విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం.. చరిత్రలో నిలిచిపోయే సిగ్గుమాలిన రాజకీయం చేస్తోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఏ ప్రభుత్వం, పార్టీ ఈ రకంగా వ్యవహరించలేదన్నారు. కమ్యూనిస్టులు భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించరని తెలుసు గానీ.. ఇంతటి ద్వేషం కలిగి ఉంటారని ఊహించలేదని మోడీ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ప్రతీ భారతీయుడు కులం, మతం అనే తేడా లేకుండా.. ఈ రిజర్వేషన్లు పొందుతారన్నారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మోడీ.. అక్కడే స్వదేశీ దర్శన్ స్కీంను ప్రారంభించారు. రూ.1550 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహంతో ఉందని మోడీ విమర్శించారు. పేదల డబ్బు దోచుకున్న ఎవ్వరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments