Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందట...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:54 IST)
కేరళ రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ సర్కారు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. మన దేశంలోని కమ్యూనిస్టులు హిందూ సంప్రదాయాలను గౌరవించరని వ్యాఖ్యానించారు. ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోడీ... వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శబరిమల విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం.. చరిత్రలో నిలిచిపోయే సిగ్గుమాలిన రాజకీయం చేస్తోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఏ ప్రభుత్వం, పార్టీ ఈ రకంగా వ్యవహరించలేదన్నారు. కమ్యూనిస్టులు భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించరని తెలుసు గానీ.. ఇంతటి ద్వేషం కలిగి ఉంటారని ఊహించలేదని మోడీ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ప్రతీ భారతీయుడు కులం, మతం అనే తేడా లేకుండా.. ఈ రిజర్వేషన్లు పొందుతారన్నారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మోడీ.. అక్కడే స్వదేశీ దర్శన్ స్కీంను ప్రారంభించారు. రూ.1550 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహంతో ఉందని మోడీ విమర్శించారు. పేదల డబ్బు దోచుకున్న ఎవ్వరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments