Publish Date: Tue, 15 Jan 2019 (12:19 IST)
Updated Date: Tue, 15 Jan 2019 (12:23 IST)
దేశంలో అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది. ఈ రిజర్వేషన్ల కోసం ఇటీవల రాజ్యాంగానికి చేసిన సవరణను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఆమోదించిన విషయం తెలిసిందే.
ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకార దేశంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడి జనరల్ క్యాటగిరీలో ఉన్న పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా 10 శాతం రిజర్వేషన్ల కల్పన సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
రాజ్యాంగ (103వ సవరణ) చట్టం-2019 లోని సెక్షన్-1లో గల ఉప సెక్షన్ (2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం జనవరి 14వ తేదీ నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
సోమవారం నుంచి ఈ రిజర్వేషన్లు అమలవుతాయి అని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వశాఖ తన గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్లను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలు అమలు చేయడంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది.
webdunia
Publish Date: Tue, 15 Jan 2019 (12:19 IST)
Updated Date: Tue, 15 Jan 2019 (12:23 IST)