Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె పేరువింటేనే వణికిపోతున్న ప్రధాని మోడీ.. ఎందుకు?

ఆమె పేరువింటేనే వణికిపోతున్న ప్రధాని మోడీ.. ఎందుకు?
, గురువారం, 10 జనవరి 2019 (10:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేతతో పాటు.. దేశ ప్రజలు కూడా వణికిపోతున్నారు. ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుని కష్టాలకు గురిచేస్తారోనని భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇపుడు అదే ఓ మహిళను చూసి భయపడిపోతున్నారు. ఈ మహిళ గతంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహా రావును వణికించారు. ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీని వణికించేందుకు సిద్ధమయ్యారు. ఆమె పేరు ఇందిరా సాహ్నీ. ఈమెను చూస్తే ప్రధాని మోడీకి ఎందుకు భయం పట్టుకుందో ఓసారి తెలుసుకుందాం. 
 
దేశంలో ఉన్న అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ)లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1992లోనే నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సీనియర్ న్యాయవాది ఇందిరా సాహ్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయపోరాటం చేశారు. అలా నాడు ఈబీసీ రిజర్వేషన్లు అమలుకాకుండా ఆమె అడ్డుకున్నారు. 
 
ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న 10 ఈబీసీ రిజర్వేషన్లను కూడా అడ్డుకోనున్నట్టు ఆమె ప్రకటించారు. ప్రధాని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల జనరల్ కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు అవకాశాలను కోల్పోతారని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే ఈ బిల్లును కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఈ బిల్లుపై పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బుధవారం ఆమె వెల్లడించారు. 
 
ఈ బిల్లు వల్ల ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లు 59 శాతానికి పెరుగుతాయని ఫలితంగా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందువల్ల దీన్ని కోర్టు కొట్టివేసే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతాన్ని ఆమె ఓసారి గుర్తుచేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వు చేస్తూ పీవీ తప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆమె వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హిజ్రా.. పేరు అప్సరా రెడ్డి