Webdunia - Bharat's app for daily news and videos

Install App

May 27 కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:58 IST)
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈనెల 15 తేదీన దక్షిణ అండమాన్‌, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.  కేరళను మే 27న ఈ రుతుపవనాలు తాకే అవకాశం వుంది. 
 
ఇక కేరళ దాకా వస్తే తెలుగు రాష్ట్రాల సమీపంలోకి రుతుపవనాలు వచ్చినట్లుగానే భావిస్తారు. కేరళ నుంచి తెలంగాణకు చేరడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. అంటే జూన్‌ మొదటి వారంలో, సాధారణ నైరుతి ఆగమన తేదీ (జూన్‌ 8) కన్నా ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. 
 
గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వర్షపాతమే నమోదైంది. నిరుడు సకాలంలో (జూన్‌ 5)నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. గాలుల దిశ మారడంతో జూన్‌లో సరిగా వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడలేదు. అందుకే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మినహా జూన్‌లో భారీ వర్షాలేమీ కురవలేదు.
 
ఆ తర్వాత రుతు పవనాలు కుదురుకోవడంతో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు దంచికొట్టాయి. ఈసారి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దిశ మారేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, స్థిరంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments