Webdunia - Bharat's app for daily news and videos

Install App

May 27 కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:58 IST)
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈనెల 15 తేదీన దక్షిణ అండమాన్‌, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.  కేరళను మే 27న ఈ రుతుపవనాలు తాకే అవకాశం వుంది. 
 
ఇక కేరళ దాకా వస్తే తెలుగు రాష్ట్రాల సమీపంలోకి రుతుపవనాలు వచ్చినట్లుగానే భావిస్తారు. కేరళ నుంచి తెలంగాణకు చేరడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. అంటే జూన్‌ మొదటి వారంలో, సాధారణ నైరుతి ఆగమన తేదీ (జూన్‌ 8) కన్నా ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. 
 
గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వర్షపాతమే నమోదైంది. నిరుడు సకాలంలో (జూన్‌ 5)నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. గాలుల దిశ మారడంతో జూన్‌లో సరిగా వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడలేదు. అందుకే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మినహా జూన్‌లో భారీ వర్షాలేమీ కురవలేదు.
 
ఆ తర్వాత రుతు పవనాలు కుదురుకోవడంతో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు దంచికొట్టాయి. ఈసారి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దిశ మారేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, స్థిరంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments