కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి?

Webdunia
గురువారం, 14 జులై 2022 (16:35 IST)
కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కేరళ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిల్స్ సేకరించినట్లు, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల కోసం పంపినట్లు ఆమె తెలిపారు. 
 
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు.  
 
ఇప్పటివరకు ఇండియాలో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు. ఒకవేళ కేరళ పేషెంట్‌కు మంకీపాక్స్ నిర్ధరణ అయితే, దేశంలో ఇదే తొలి కేసు అవుతుంది. 
 
ఇప్పటివరకు అమెరికా సహా 57 దేశాల్లో, 8,200 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. రెండు రోజుల క్రితం రష్యాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇది క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments