Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరాఠీలకు శుభవార్త చెప్పిన సీఎం ఏక్‌నాథ్ షిండే

Webdunia
గురువారం, 14 జులై 2022 (15:59 IST)
ఇటీవల మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సాథ్యంలో శివసేన రెబెల్స్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరించారు. ఇపుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర వాసులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది. 
 
ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.35గా ఉండగా, తాజా తగ్గింపుతో రూ.106.35కి తగ్గనుంది. అదేసమయంలో రూ.97.28గా డీజిల్.. రూ. 94.28కే లభ్యం కానుంది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.6 వేల కోట్ల మేర భారం పడనుంది. అయితే ఈ చర్య వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రానుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments