Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో పొంచివున్న సీజనల్ వ్యాధులు - నిపుణుల హెచ్చరిక

rain
, బుధవారం, 13 జులై 2022 (10:21 IST)
తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తితో పాటు సీజనల్ వ్యాధులు ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా, డెంగ్యూ వంటివి మరింతగా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. 
 
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తడి వాతావరణ పరిస్థితుల నెలకొనివుంది. ఈ కారణంగా రాబోయే వారాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ పెరుగుతాయని ఆరోగ్య అధికారులు మరియు నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
'సుదీర్ఘంగా ఉన్న తడి, మేఘావృతమైన పరిస్థితుల దృష్ట్యా, కోవిడ్ పాజిటివ్ ఇన్‌ఫెక్షన్లు కాకుండా సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా కేసులు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల ప్రజలు అనారోగ్యం బారినపడుకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వారు సలహా ఇస్తున్నారు. 
 
కాగా, హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లు గణనీయమైన సంఖ్యలో నమోదవుతున్నాయని, అయితే ఎక్కువ మంది రోగులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని నిపుణులు సూచించారు. 'కోవిడ్‌కు పాజిటివ్ పరీక్షించే వ్యక్తులు తమను తాము వేరుచేయాలి, తద్వారా వైరస్ హాని కలిగించే జనాభాకు వ్యాపించదు. అదేసమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొన్ని నెలల పాటు గృహాలు కనీసం వారానికి ఒకసారి డ్రై-డేను అమలు చేయాలి' అని కోరారు. 
 
మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డిపిహెచ్) డాక్టర్ జి శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే, తెలంగాణలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంది. 
 
సాధారణ జలుబు మరియు కోవిడ్ -19 లక్షణాల సారూప్యత కారణంగా ప్రజలు కోవిడ్ కోసం పరీక్షించడానికి వెనుకాడవచ్చని, ఇలాంటి వారు ఖచ్చితంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు మరియు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేవలం రూ .26లకే భారత్-వియత్నాంకు ఫ్లైట్ జర్నీ.. నిజమా?