సుప్రీం ఈమెయిల్ నుంచి ప్రధాని ఫోటో తొలగింపు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:49 IST)
సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి లాయర్లకు వెళ్లే ఈ-మెయిల్ కింద భాగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచార చిత్రం ఉండటంపై అత్యున్నత న్యాయస్థానం (ఎస్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
రిజిస్ట్రీ అభ్యంతరంపై తక్షణమే స్పందించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆ ప్రచార చిత్రాన్ని తొలగించింది. ఆ ఫోటో స్థానే విద్యుత్ వెలుగుల్లో ఉన్న సుప్రీంకోర్టు భవనం ఫోటోను పెట్టింది.
 
దేశ 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్ల, ఈ-మెయిల్స్‌లో 'సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' నినాదంతో పాటు మోడీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. 
 
సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ కింద భాగంలో కూడా దీన్ని ఉంచింది. ఈ విషయాన్ని కొందరు లాయర్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్లడంతో రిజిస్ట్రీ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్‌ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తొలగించాలని ఎన్‌ఐసీని ఆదేశించింది. దీనిపై తక్షణ చర్యలకు దిగిన ఎన్‌ఐసీ.. సుప్రీంకోర్టు ఈ-మెయిల్ కింద భాగంలోని మోదీ ప్రచార చిత్రాన్ని తొలగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments