Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుప్రీంకోర్టు ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి ఫోటో తొలగింపు

సుప్రీంకోర్టు ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి ఫోటో తొలగింపు
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:13 IST)
సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో తొలగించబడింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి లాయర్లకు వెళ్లే ఈ-మెయిల్ కింద భాగంలో మోదీ ప్రచారం చిత్రం వుండేది. ప్రస్తుతం ఈ ఫోటోను తొలగించారు. 
 
ఇంతకు ముందు ఈ ఫోటోపై అత్యున్నత న్యాయస్థానం (ఎస్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై తక్షణమే స్పందించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆ ప్రచార చిత్రాన్ని తొలగించింది. ఆ ఫోటో బదులుగా సుప్రీంకోర్టు భవనం ఫోటోను ఉంచారు. 
 
దేశ 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్ల, ఈ-మెయిల్స్‌లో 'సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' నినాదంతో పాటు మోదీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. 
 
కానీ న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్‌ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తీసి వేయాలని ఎన్‌ఐసీని ఆదేశించడంతో తొలగించడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పర్వతారోహకుడుకి ఏపీ సీఎం జగన్ ఆర్థిక సాయం