Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేకు 37 ఏళ్లు, నా కూతురికి 19 ఏళ్లు, భయపెట్టి పెళ్లాడాడు: తమిళనాడు తండ్రి సూసైడ్ యత్నం- Video

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (16:47 IST)
ఇటీవలే తమిళనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు, సౌందర్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. అంతా బాగానే వుందని అనుకుంటున్నారు కానీ తన కుమార్తె సౌందర్యను ఎమ్మెల్యే ప్రభు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 
 
అతడికి 37 ఏళ్లనీ, తన కుమార్తె 19 ఏళ్లనీ, అతడి వయసులో సగం వయసున్న తన కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లాడారంటూ ఆయన పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటే వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసారు. పోలీసులు అతడిని వారించారు.
 
కాగా సౌందర్య తండ్రి స్వామినాథన్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తెను ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినా తను లొంగలేదనీ, దాంతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ ఆరోపిస్తున్నారు. ఐతే ఎమ్మెల్యే తరపు బంధువులు మాత్రం మేము దళితలమని ఆయన అలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
 
కానీ సౌందర్య తండ్రి ఈ విషయాన్ని కొట్టిపారేసారు. తను కులమతాలను పట్టించుకోననీ, కేవలం అతడికీ తన కుమార్తెకి వయసు అంతరమే తనకు అభ్యంతరమంటూ చెప్పుకొచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసారు. కోర్టులో పిటీషన్ కూడా వేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments