Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుప్రమాదంలో కేంద్ర మంత్రికి తప్పిన ముప్పు.. కాని సతీ వియోగం

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:18 IST)
రక్షణ, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలవగా, భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ మరణించినట్లు అధికారులు తెలిపారు.

శ్రీపాద్‌ నాయక్‌ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్‌ నుంచి గోకర్ణ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.

మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను ప్రధాని మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. అవసరమైతే విమానంలో ఆయనను ఢిల్లీ తరలించాలని సూచించారు. కాగా, సావంత్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments