Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Advertiesment
road accident
, శనివారం, 2 జనవరి 2021 (19:55 IST)
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్య పేట  సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అవ్వడంతో పాటు ఆటో డ్రైవర్ రాము, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి సాయి ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఆటోలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని  స్థానికుల సహకారంతో గాయపడ్డవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయిప్రదీప్ కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం నరరూప రాక్షసుడు : చంద్రబాబు