Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో 14 ఏళ్ల బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:00 IST)
యూపీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఓ 14 ఏండ్ల బాలికను అయిదుగురు దుండగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రిస్తున్నది. ఆ సమయంలో ఓ అయిదుగురు దుండగులు.. ఇంట్లోకి వచ్చి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి కిడ్నాప్‌ చేశారు. 
 
నిందితులలో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక తన కుంటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపింది. 
 
దాంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఐదుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
రాంపూర్ ఎస్పీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ ఐదుగురు నిందితులలో ఒకరితో బాలికకు స్నేహం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ కాలేదని చెప్పారు. 
 
అయితే కేసు తీవ్రత, చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం