Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో 14 ఏళ్ల బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:00 IST)
యూపీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఓ 14 ఏండ్ల బాలికను అయిదుగురు దుండగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రిస్తున్నది. ఆ సమయంలో ఓ అయిదుగురు దుండగులు.. ఇంట్లోకి వచ్చి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి కిడ్నాప్‌ చేశారు. 
 
నిందితులలో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక తన కుంటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపింది. 
 
దాంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఐదుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
రాంపూర్ ఎస్పీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ ఐదుగురు నిందితులలో ఒకరితో బాలికకు స్నేహం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ కాలేదని చెప్పారు. 
 
అయితే కేసు తీవ్రత, చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం