Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ సిబ్బందికి భారత్ వార్నింగ్?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:24 IST)
పాకిస్థాన్ పౌరులైనా, ఉన్నతాధికారులైనా తమలోని వక్రబుద్ధిని వదిలిపెట్టలేరు. ఫలితంగా వారు ఎక్కడ ఉన్నా ఛీకొట్టించుకుంటుంటారు. తాజాగా ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిలో సగం మంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో అప్రమత్తమైన భారత విదేశాంగ శాఖ తక్షణం సగం మంది ఉద్యోగులు తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరింది కూడా. 
 
అలాగే, ఇస్లామాబాద్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి కూడా సగం మందిని తగ్గించనున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ హై కమిషన్ కార్యాలయంలోని సగం మందిని వారం రోజుల్లోగా తొలగించాలని విదేశాంగ శాఖ ఆదేశించింది.
 
పాకిస్థాన్ హై కమిషన్ ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంటున్నారని పదేపదే ఆరోపణలు చేస్తున్నా, హై కమిషన్ తీరు మారడం లేదని వెల్లడించిన విదేశాంగ శాఖ, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 
 
వియన్నా ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడటం లేదని, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, ఉద్యోగులు సీమాంతర ఉగ్రవాదాన్ని, హింసను ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇటీవలే ఇద్దరు పాక్ ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని, వారిని మే 31న దేశం నుంచి బహిష్కరించామని గుర్తు చేశారు.
 
గతవారం ఇస్లామాబాద్‌లోని ఇద్దరు భారత హై కమిషన్ అధికారులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే భారత్ తీవ్రంగా స్పందించి, అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వారిని తిరిగి వదిలేశారు. వీరికి గాయాలు అయ్యాయి. 
 
ఐఎస్ఐ వీరిని నిర్బంధంలోకి తీసుకుని హింసించినట్టు తెలుస్తుండగా, వీరిద్దరూ ఓ రోడ్ యాక్సిడెంట్ చేశారని, దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్టేట్ మెంట్ తీసుకుని వదిలేశారని పాక్ అధికారులు వెల్లడించారు. 
 
ఆపై ఇద్దరూ జూన్ 22న భారత్‌కు చేరుకున్నారు. ఆపై వీరు తాము ఎదుర్కొన్న చిత్రహింసలను విదేశాంగ శాఖకు వెల్లడించగా, ఆ వెంటనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments