ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన మాయావతి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:27 IST)
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో సీఏఏకు మద్దతు ప్రకటించిన సొంత పార్టీ ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్‌పై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని మాయావతి ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు.

'బీఎస్‌పీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ క్రమశిక్షణను ఉల్లంఘించే ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ఫథెరియా ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ సీఏఏకు మద్దతు ప్రకటించారు. దాంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా బ్యాన్ విధించాం' అని మాయావతి ఆ ట్వీట్‌లో తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం విభజనలను సృష్టిస్తుందని, రాజ్యాంగ నియమనిబంధనలకు వ్యతిరేకమని బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉందని, పార్లమెంటులో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని మరో ట్వీట్‌లో మాయావతి తెలిపారు.

సీఏఏను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరిన వారిలో బీఎస్‌పీ కూడా ఉందన్నారు. ఇంత జరిగినా సీఏఏకు రమాభాయ్ పరిహార్ మద్దతు ప్రకటించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments