Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి సామూహిక వివాహాలు .. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:07 IST)
ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ వివాహాల పేరుతో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా బొక్కేస్తున్నారు. ఈ తంతు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలో పేద యువతుల పెళ్లిళ్ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థిక సాయం కింద రూ.51,000 ఇస్తుంది. అక్రమంగా లబ్ది పొందాలనే దురాశతో కొందరు అధికారులు దళాతులతో కుమ్మక్కయ్యారు. ఆ మేరకు జనవరి 25వ తేదీన మునియర్ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకొచ్చారు. 
 
పెళ్లికాని, పళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఎర చూపారు. ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ దృశ్యాలు టీవీల్లో వైరల్ కావడంతో అసలు విషయం బహిర్గతమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఎనిమిది మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. అయితే, ఈ సామూహిక పెళ్ళిళ్ళు చేసుకున్న దంపతులకు ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments