Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (16:43 IST)
ఛత్తీస్‌గఢ్ - ఒరిస్సా సరిహద్దుల్లో తాజాగా నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో (ఎన్‌కౌంటరు)లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మవోయిస్టు అగ్రనేత చలపతి కూడా ఉన్నారు. ఈయన కొన్ని దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకుంటూ వచ్చారు. కానీ, తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో దిగిన సెల్ఫీ ఆయన ప్రాణాలు హరించేలా చేసింది. 
 
గత 2008 ఫిబ్రవరిలో ఒరిస్సా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లాలో జరిగిన దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన మాస్టర్ మైండ్ చలపతిగా గుర్తించిన పోలీసులు అతని తలపై ఒక కోటి రూపాయల వరకు రివార్డు ప్రకటించారు. అయితే చలపతి ఎలా ఉంటాడో చాలా రోజుల వరకు బయటకు తెలియరాలేదు. 2016 వరకు అతని ఫొటోలు పోలీసులకు లభించలేదు. 
 
చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు. అరుణ ఆంధ్ర - ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్‌తో పని చేసింది. ఆ సమయంలో తన భర్తతో సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీయే చలపతి రూపురేఖలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడింది.
 
అరుణ తన భర్త చలపతితో దిగిన సెల్ఫీని సోదరుడైన ఆజాద్‌కు పంపించింది. 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఆజాద్ చనిపోయాడు. ఆజాద్ స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. అప్పుడే చలపతి ఎలా ఉంటాడనే విషయం తెలిసింది. పోలీసులు అతని తలకు కోటి రివార్డును ప్రకటించారు. 
 
చలపతి చిత్తూరు వాసి. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో సీనియర్ సభ్యుడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అతను చురుగ్గా ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు పెరుగుతుండటంతో కొన్ని నెలల క్రితం తన స్థావరాన్ని మార్చుకున్నాడు. అతను ఒడిశా బార్డర్‌కు వచ్చాడు. చలపతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments