Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (19:16 IST)
ప్రతిరోజూ వందల సంఖ్యలో విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఇప్పుడు చెరువుగా మారింది.

కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలతో సందడి వాతావరణం నెలకొంది.
 
వేసవికాలం నుండి ఉపశమనం కోరుకున్న ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు.


పోర్ట్‌కు సమీపంలో ఉన్న చెరువు నుంచి చేపలతో పాటు అనేక జలచరాలు ఉన్నాయి. అందులో పాములు కూడా ఉండడం విశేషం.
 
ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు చేపలతో సందడిగా మారిపోయింది. క్యాట్ ఫిష్‌లతో పాటు పలు రకాల చేపలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. పైలట్‌లు సైతం ఈ వింతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో చేపల వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రన్‌వేపై పట్టిన చేపలను చెరువుల్లోకి వదిలేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments