Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భారీ వర్షాలు - కొండ చరియలు విరిగిపడి...

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:31 IST)
మణిపూర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం ఉదయానికి 14కు చేరింది. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మందిని సురక్షితంగా రక్షించారు. 
 
మరోవైపు, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైలు నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొలుత ఏడుగురు జవాన్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. 70 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, శుక్రవారాం ఉదయానికి ఈ మృతుల సంఖ్య 14కు చేరింది. 
 
ఈ ప్రమాదంలో మణిపూర్ డీజీపీ డౌంగెల్ స్పందిస్తూ, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకునివున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. అయితే, దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చన్న అంచనాలు వేస్తున్నట్టు చెప్పారు. వారిలో ఆర్మీ, రైల్వే అధికారులు, కూలీలు, గ్రామస్థులు ఉన్నారని ఆయన తెలిపారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లేనని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments