Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భారీ వర్షాలు - కొండ చరియలు విరిగిపడి...

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:31 IST)
మణిపూర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం ఉదయానికి 14కు చేరింది. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మందిని సురక్షితంగా రక్షించారు. 
 
మరోవైపు, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైలు నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొలుత ఏడుగురు జవాన్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. 70 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, శుక్రవారాం ఉదయానికి ఈ మృతుల సంఖ్య 14కు చేరింది. 
 
ఈ ప్రమాదంలో మణిపూర్ డీజీపీ డౌంగెల్ స్పందిస్తూ, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకునివున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. అయితే, దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చన్న అంచనాలు వేస్తున్నట్టు చెప్పారు. వారిలో ఆర్మీ, రైల్వే అధికారులు, కూలీలు, గ్రామస్థులు ఉన్నారని ఆయన తెలిపారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లేనని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments