Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై స్టంట్స్... మందలిచిన వ్యక్తిని 28 సార్లు కత్తితో పొడిచి చంపేసిన కిరాతకులు

Webdunia
బుధవారం, 15 జులై 2020 (12:17 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ వ్యక్తిని 28 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. బైకుపై స్టంట్స్ చేస్తున్న వారిని మందలించడమే ఆ వ్యక్తి చేసిన నేరం. వెస్ట్ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌కు చెందిన ముగ్గురు కుర్రాళ్లు బైక్‌లపై స్టంట్స్ చేస్తున్నారు. దీన్ని గమనించిన ఓ స్థానికుడు ఆ కుర్రాళ్లను అడ్డగించి, తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు. 
 
అంతే ఆ కుర్రాళ్లకు కోపం వచ్చేసింది. అతనిపై దాడికి తెగబడి కత్తితో 28సార్లు పొడిచేశారు. ఫలితంగా ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తర్వాత బైక్ స్టంట్స్‌కు పాల్పడటమే కాకుండా, ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments