Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ముఖంపై శానిటైజర్ చల్లి... లైటర్‌తో తగలబెట్టేశాడు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (12:12 IST)
చండీగఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ప్రియురాలి ముఖంపై శానిటైజర్ చల్లిన ఓ ప్రియుడు.. లైటర్‌తో తగులబెట్టి చంపేశాడు. దీనికి కారణం కేవలం 2 వేల రూపాయలు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చండీగఢ్ రాష్ట్రంలో కిరాతకుడు తన ప్రియురాలిని రూ.2 వేలు ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ముఖంపై శానిటైజర్‌ చల్లి.. లైటర్‌తో నిప్పు అంటించాడు. 
 
ఈ ఘటనలో ఆమె ముఖం 20 శాతం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. 
 
కాగా.. బాధితురాలి వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. డబ్బుల కోసం అతడు బాధితురాలిని తరచూ వేధించేవాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments