Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో వెంట్రుక వచ్చిందనీ.. భార్యకు గుండుకొట్టించిన భర్త.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (13:51 IST)
తినే ఆహారంలో వెంట్రుక వచ్చిందన్న ఆగ్రహంతో కుటుంబ సభ్యుల ముందే తన భార్యను ఓ ప్రబుద్ధుడు గుండు కొట్టించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలిబిత్ జిల్లా మిలాక్ అనే గ్రామానికి చెందిన జహీరుద్దీన్ - సీమాదేవి (30) అనే దంపతులు ఉన్నారు. ఏడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. శుక్రవారం రాత్రి సీమాదేవి తన భర్తకు ఆహారం వడ్డించింది. అందులో ఓ వెంట్రుక కనిపించడంతో జహీరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల ముందే భార్యను చితకబాదాడు. వారి ముందే గుండు కొట్టాడు. 
 
ఈ అవమానాన్ని భరించలేని సీమాదేవి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు గుండు కొట్టించాడని, పైగా, రూ.15 లక్షల కట్నం తీసుకుని రావాలంటూ అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఆమె పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జహీరుద్దీన్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments