Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరె నీ యిష్టంతో పనేముంది, నాతో రాకపోతే నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అన్నాడు: మీడియాతో వైశాలి

Vaishali
, శనివారం, 10 డిశెంబరు 2022 (20:49 IST)
సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్ కేసులో బాధితురాలు వైశాలి మీడియా ముందుకు వచ్చారు. తనను కారులో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసాడనీ, అంగీకరించకపోతే ఇక్కడితోనే నీ లైఫ్ ఎండ్ అవుతుందని బెదిరించాడంటూ వెల్లడించారు.

 
శనివారం రాత్రి ఆమె మాట్లాడుతూ... నన్ను పెళ్లి చేసుకుంటానని బంధువు ద్వారా సంప్రదించాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను. ఇక అప్పట్నుంచి వేధించడం మొదలుపెట్టాడు. ఫేక్ ఇన్‌స్టాగ్రాం క్రియేట్ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడు. నువ్వంటే నాకిష్టం, బాగా చూసుకుంటా వచ్చేయవచ్చు కదా అనేవాడు.

 
నో అని చెప్పినదగ్గర్నుంచి ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తూ వచ్చాడు. దీనిపై మూడు నెలల కిందట కంప్లైంట్ ఇచ్చాను. సీఐ గారు పట్టించుకోలేదు. మీ సేఫ్టీ మీరు చూసుకోవాలని అన్నారు. నన్ను కిడ్నాప్ చేసి కారులో తన ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నన్ను పెళ్లాడకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు. మీ నాన్నను అంతం చేస్తానన్నాడు. నా కెరీర్ ఎంతో వుంది. ఇలా బజారున పడేసి నా భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. పోలీసులు వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది వైశాలి.

 
కాగా పోలీసులు ఇప్పటివరకూ 36 మందిపై కేసు నమోదు చేసారు. ప్రధాన నిందితుడు నవీన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్