Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 రోజులు.. తల్లి మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (10:52 IST)
మూఢ నమ్మకం కారణంగా ఓ యువకుడు తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే 21 రోజులు వుంచాడు. తల్లి మృతదేహంతోనే కాలం గడిపాడు. ఎవరైనా మరణించిన 21 రోజుల తర్వాత ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే మూఢనమ్మకంలో ఓ యువకుడు తన తల్లి విషయంలో అదే చేయాలనుకున్నాడు. కానీ పోలీసులకు పట్టుబడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌కు చెందిన 38 సంవత్సరాల మైత్రేయ భట్టాచార్య తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకున్నాడు. తల్లి కృష్ణ (77)తో కలసివుంటున్న మైత్రేయ 18 రోజుల క్రితం తల్లి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మృతదేహాన్ని ఖననం చేయకుండా మైత్రేయ అలానే వుంచాడు. 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచాలని చూశాడు. 
 
అలా 18 రోజులు గడిపాడు. ఆ తర్వాత తన తల్లి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు సాయం కావాలని అతను బహిరంగంగా అరవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments