Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ... ప్రాణాలు కోల్పోయిన ఇంజనీర్

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:27 IST)
కొంతమంది జిమ్‌లో కసరత్తులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇపుడు ఓ ఇంజనీర్ త్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర  సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామ్‌ నగర్‌కు చెందిన సుధీర్ ఉపాధ్యాయ్ తన బంధువు నారాయణ్ జోషితో పాటు ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 76లోని జేఎం ఆర్కిడ్ సొసైటీలో నివసిస్తున్నారు. సుధీర్ వ్యాయామంలో భాగంగా, త్రెడ్‌మిల్‌పై నడక సాగిస్తూ వచ్చాడు.
 
ఈ క్రమంలో అతను అదుపుతప్పి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన జిమ్‌లోని వారంతా అతనిని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తేల్చిచెప్పారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments