Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఫోటోలు, వీడియోలను సోదరుడికి పంపాడు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:49 IST)
వరకట్నం కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే తన అభ్యంతరకరమైన ఫొటోలను, వీడియోలను సోదరుడికి పంపించాడని ఆరోపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం బాధిత మహిళకు గ్వాలియర్ ప్రాంతానికి చెందిన నిందితుడితో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే నిందితుడు ఆమెను కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు. రెండేళ్ల పాటు నిందితుడు వేధింపులను అతని భార్య భరించింది. 
 
రెండేళ్లు గడిచినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది. కట్నం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భర్త ఇంటిని వదిలి.. తల్లిదండ్రులతో కలిసి భోపాల్‌లో నివాసం ఉండసాగింది. ఇక, తనపై నమోదు చేసిన వరకట్నం కేసును ఉపసంహరించుకోవాలని ఆ మహిళను ఆమె భర్త బలవంతం చేశాడు. ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
 
ఈ క్రమంలోనే మహిళ అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను ఆమె సోదరుడికి పంపించాడు. వాటిని అందరికి షేర్ చేసి బహిరంగ పరుస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
 
ఈ క్రమంలోనే భర్తపై ఆమె మరోసారి పోలీసులకు ఆశ్రయించింది. భోపాల్‌లోని కోలార్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త నీతిమాలిన చర్యపై మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments