భార్య ఫోటోలు, వీడియోలను సోదరుడికి పంపాడు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:49 IST)
వరకట్నం కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే తన అభ్యంతరకరమైన ఫొటోలను, వీడియోలను సోదరుడికి పంపించాడని ఆరోపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం బాధిత మహిళకు గ్వాలియర్ ప్రాంతానికి చెందిన నిందితుడితో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే నిందితుడు ఆమెను కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు. రెండేళ్ల పాటు నిందితుడు వేధింపులను అతని భార్య భరించింది. 
 
రెండేళ్లు గడిచినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది. కట్నం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భర్త ఇంటిని వదిలి.. తల్లిదండ్రులతో కలిసి భోపాల్‌లో నివాసం ఉండసాగింది. ఇక, తనపై నమోదు చేసిన వరకట్నం కేసును ఉపసంహరించుకోవాలని ఆ మహిళను ఆమె భర్త బలవంతం చేశాడు. ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
 
ఈ క్రమంలోనే మహిళ అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను ఆమె సోదరుడికి పంపించాడు. వాటిని అందరికి షేర్ చేసి బహిరంగ పరుస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
 
ఈ క్రమంలోనే భర్తపై ఆమె మరోసారి పోలీసులకు ఆశ్రయించింది. భోపాల్‌లోని కోలార్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త నీతిమాలిన చర్యపై మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments