Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని ఫోన్ మాట్లాడాడు.. తరుముకున్న రైల్వే డ్రైవర్ (video)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (17:19 IST)
Railway Track
అవును.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ వాటితో గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బండి నడిపేటప్పుడు స్మార్ట్ ఫోన్లలో మాట్లాడవద్దని ఎన్ని రూల్స్ పెట్టినా.. అవన్నీ ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు చాలామంది. 
 
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. కట్ చేస్తే.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఏకంగా రైలు పట్టాలపై కూర్చుని ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. వేరే మార్గం లేకపోవడంతో, డ్రైవర్ రైలును ఆపవలసి వచ్చింది. ఆ వ్యక్తి రైలు తన ముందు ఆగిందని గమనించినప్పుడు మాత్రమే పారిపోయాడు. అయితే, డ్రైవర్ దిగి అతనిపై రాయి విసిరాడు. కానీ ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
 
ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక ఆగంతకుడు తన సెల్ ఫోనులో బంధించిన ఈ వీడియోపై రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments