శవాలతో రాజకీయమా.. మీకు సిగ్గుగా లేదు : మమతా బెనర్జీ నిప్పులు

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (09:00 IST)
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల శవాలతో భారతీయ జనతా పార్టీ నేతలు రాజకీయాలు చేయడంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. వీర జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేయడం మీకు సిగ్గుగా లేదా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఆమె సూటిగా ప్రశ్నించారు. 
 
పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, జవాన్ల వీర మరణంతో ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని, తానొక్కడినే దేశభక్తుడినని, మిగతావారు దేశద్రోహులని చిత్రీకరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. 
 
జవాన్ల మృతదేహాలతో రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ ఉనికికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రజలకు సూచించారు. 
 
గత ఐదేళ్ళ కాలంలో మీరు (మోడీ) చేసింది ఏమీ లేదు. పైగా మన జవాన్ల వీరమరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేం మోడీ ప్రభుత్వం వెనుక లేము. దేశానికి రక్షణ కల్పిస్తున్న మన సైనికుల వెంట ఉన్నాం అని అన్నారు. బాలాకోట్ ఉగ్రదాడుల వివరాలు బయటపెట్టమని తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే మాపై పాకిస్థాన్ ముద్ర వేస్తున్నారని, ఆయన (మోడీ) తాను మాత్రమే భారతీయుడినని అనుకుంటున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments