Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సారీ చెప్పిన వెస్ట్ బెంగాల్ సీఎం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (19:54 IST)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ తరపున సారీ చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న అఖిల్ గిరి ఆదివారం బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తూ, రాష్ట్రపతి ముర్ము రూపాన్ని ప్రస్తావించారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, ముర్ము సొంత రాష్ట్రంలో ఒరిస్సాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని, అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరపున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తమ పార్టీ నేతలతో పాటు మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. అలాగే, మంత్రి అఖిల్ గిరి కూడా రాష్ట్రపతికి సారీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments