Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి... నేతల నివాళులు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (10:03 IST)
జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి వేడుకలు జనవరి 30వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలుగా ఎన్నుకుని బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. బ్రిటీష్ సామాజ్య పాలన నుంచి భారత్‌కు విముక్తి కలిగించిన నేత. ఈయన 74వ వర్థంతి వేడుకలు ఆదివారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తుంది. 
 
"అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తిస్థాయిలో సాధన చేయలేక పోయినా, దాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనత వరకు దూరంగా ఉండాలి" అంటూ మహాత్మా గాంధీ యావత్ ప్రజలకు అమూల్యమైన సందేశం ఇచ్చారు. 
 
గాంధీ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేశారు. 
 
కాగా, "సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు" అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments