Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీని చంపిన మరో వ్యక్తి ఎవరు?

జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో వ్యక్తి చంపినట్టు తాజా కథనం. నిజానికి గాంధీ హత్య కేసు విచారణ జరిగి, కోర్టు తీర్పు ప్రకారం గాడ్సేని ఉరితీశారు. క

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:23 IST)
జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో వ్యక్తి చంపినట్టు తాజా కథనం. నిజానికి గాంధీ హత్య కేసు విచారణ జరిగి, కోర్టు తీర్పు ప్రకారం గాడ్సేని ఉరితీశారు. కానీ, ఈ హత్యపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తుతూనే ఊన్నాయి. గాడ్సే గాంధీని మూడు బుల్లెట్లతో కాల్చాడని పోలీసులు తేల్చారు.
 
అయితే, గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని, నాలుగో బుల్లెట్ ఆయన శరీరంలోంచి దూసుకుపోవడం వల్లే మరణించారని అప్పట్లో అంతర్జాతీయంగా మీడియాలో ప్రచారం జరిగింది. మరి, ఆ నాలుగో బుల్లెట్‌ను ఎవరు కాల్చారు? ఈ హత్య కుట్రలో గాడ్సే కాకుండా మరో వ్యక్తి వున్నాడా? ఉంటే ఎవరు? అన్న వివాదం అప్పటి నుంచి కొనసాగుతోంది.
 
ఈ నేపథ్యంలో 'ఆధునిక అభినవ భారత్‌' వ్యవస్థాపకుడు డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నీస్‌ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ దాఖలు చేశారు. అందులో గాడ్సే కాల్చిన మూడు బుల్లెట్ల వల్ల గాంధీ చనిపోలేదని, నాలుగో బుల్లెట్ వల్లే ఆయన మరణించాడని పేర్కొన్నారు. అందువల్ల గాంధీ హత్యకేసును రీ ఓపెన్‌ చేసి విచారణ చేపట్టాలని కోరారు. 
 
గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని అప్పట్లో ప్రపంచంలోని అన్ని వార్తా పత్రికల్లో వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఆ నాలుగో బుల్లెట్‌ ఎక్కిడి నుంచి వచ్చింది? దాన్ని ఎవరు పేల్చారు? అన్న అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని ఆయన తెలిపారు. కాగా, ఈ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments