Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికతో మద్యంతాగించి మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
సోమవారం, 18 జులై 2022 (16:40 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అమరావతి జిల్లాలోని ఓ హోటల్‌లో 17 యేళ్ల బాలికపై పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ బాలికకు మద్యం తాగించి మరీ అత్యాచారం చేశాడు. పైగా, నిందితుడితో పాటు బాధితురాలు కూడా ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమరావతి జిల్లాకు చెందిన 17 యేళ్ల బాలిక ఒకరు నాగ్‌పూర్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటుంది. ఈ బాలికను మాయమాటలు చెప్పి తన బుట్టలో వేసుకున్న ఎస్ఐ ఈ నెల 13వ తేదీన కారులో నగరమంతా తిప్పాడు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. 
 
మరుసటి రోజు ఇంటికి వచ్చిన బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బాలికపై అత్యాచారానికి పాల్పడిన 35 యేళ్ల ఎస్ఐను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, నిందితుడు ఎస్ఐ పేరును పోలీసులు బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం