Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికతో మద్యంతాగించి మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
సోమవారం, 18 జులై 2022 (16:40 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అమరావతి జిల్లాలోని ఓ హోటల్‌లో 17 యేళ్ల బాలికపై పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ బాలికకు మద్యం తాగించి మరీ అత్యాచారం చేశాడు. పైగా, నిందితుడితో పాటు బాధితురాలు కూడా ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమరావతి జిల్లాకు చెందిన 17 యేళ్ల బాలిక ఒకరు నాగ్‌పూర్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటుంది. ఈ బాలికను మాయమాటలు చెప్పి తన బుట్టలో వేసుకున్న ఎస్ఐ ఈ నెల 13వ తేదీన కారులో నగరమంతా తిప్పాడు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. 
 
మరుసటి రోజు ఇంటికి వచ్చిన బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బాలికపై అత్యాచారానికి పాల్పడిన 35 యేళ్ల ఎస్ఐను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, నిందితుడు ఎస్ఐ పేరును పోలీసులు బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం