Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంటైనర్ తలపులో రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్!

heroin
, శనివారం, 16 జులై 2022 (09:41 IST)
ముంబై, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఓ కంటైనర్ తలుపుల్లో అక్రమంగా నిల్వవుంచి రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధినం చేసుకున్నారు. ఇది రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. 
 
దుబాయ్‌ నుంచి నవాషెవా పోర్టుకు చేరిన ఆ కంటైనర్‌... పాత ముంబై-పుణె జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయ్‌గఢ్‌ జిల్లా పన్వెల్‌లోని ఓ ప్రైవేటు యార్డులో కనిపించింది. నిశితంగా పరిశీలించగా... దాని తలుపు లోపల 168 ప్యాకెట్ల హెరాయిన్‌ వెలుగుచూసింది. 
 
ఈ మాదకద్రవ్యం మొత్తం బరువు 72.51 కిలోలుగా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.362.59 కోట్లు ఉంటుందని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరోచోట 72 కిలోల నల్లమందును చేజిక్కించుకున్నట్టు పంజాబ్‌ డీజీపీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావరి మహోగ్రరూపం: ధవళేశ్వరం వద్ద ఆనాటి పరిస్థితులు