Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం - 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (16:26 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
 
టిప్పర్‌పై కూర్చున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు. టిప్పర్ ఐరన్ లోడుతో ప్రయాణిస్తుండగా, కూలీలు ఐరన్ లోడుపై కూర్చున్నారు. వారందరూ సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments