Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో మరో సాధువు హత్య.. 40 రోజుల్లో రెండో మర్డర్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (17:33 IST)
శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ కూటమి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో మరో సాధువు హత్యకు గురయ్యాడు. ఈ రాష్ట్రంలో గత 40 రోజుల్లో సాధువులు హత్యకు గురికావడం ఇది రెండో ఘటన. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, నాందేడ్‌ జిల్లాలోని ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు. ఇద్దరి మృత దేహాలూ స్నానాల గదిలో పడేశారు. ఇద్దరినీ గొంతుకోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ హత్యల తర్వాత డబ్బు, బంగారం దోచుకుని పారిపోతుండగా హంతకుడిని స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే హంతకుడు దొరక్కుండా పారిపోయాడు. హత్యకు గురైన ఆశ్రమంలోనే శివచార్య చాలా కాలంగా ఉంటున్నారని భక్తులు తెలిపారు.   
 
కాగా, గత నెల 16వ తేదీన పాల్‌ఘర్‌‌లో వంద మందికి పైగా సాయుధులు ఇద్దరు సాధువులపై సామూహిక దాడి చేసి చంపేశారు. ఇంతలోనే మహారాష్ట్రలో మరో సాధువు హత్య జరగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఉద్ధవ్ పాలనలో సాధువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే హంతకులను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments