Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతుల మధ్య దాపరికాలు.. భార్యకు తెలియకుండా సెటప్ చేశాడు.. చివరికి?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (22:51 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత కరువైంది. ఇందుకు స్మార్ట్ ఫోన్లు కూడా కారణమని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని దంపతుల మధ్య దాపరికాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భార్యను కడతేర్చడం, వివాహేతర సంబంధాల కోసం ఎన్నో నేరాలకు పాల్పడే వారు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతే.. విషయం భార్యకు తెలిసి చితక్కొట్టింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతానికి చెందిన కిషన్ స్థానికంగానే ఓ సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్నాడు. కిషన్‌కు 2017లో రేవతి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఉన్నంతలో వీరి జీవితం సాఫిగానే సాగుతుంది. కిషన్‌కు ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఏకంగా ఆ మహిళతో రత్నగిరిలోనే వేరు కాపురం పెట్టాడు. త్వరలోనే ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం రేవతికి తెలిసింది. కిషన్ మహిళతో కలిసుండగా పక్కా సమాచారంతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా వారిని రేవతి పట్టుకుంది. ఆమెతో వచ్చిన బంధువులంతా కలిసి కిషన్‌కు, ఆయన ప్రియురాలికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments