Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ లాండరింగ్ కేసు... దావూద్‌ ఇబ్రహీంతో లింకులు.. మహారాష్ట్ర మంత్రి అరెస్టు

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:35 IST)
మనీ లాండరింగ్ వ్యవహారంలో అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఆయన ముఠా సభ్యులతో‌ సంబంధాలు కలిగివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఈయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా కావడం గమనార్హం. 
 
దావూద్‌తో లింకులపై ఆయన వద్ద ఏడు గంటల పాటు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. మనీలాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను కొద్దిరోజుల క్రితమే అరెస్టు చేసింది. కస్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దావూద్ గ్యాంగ్‌తో పాటు ఇతర మాఫియా ముఠాల నుంచి నవాబ్ మాలిక్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో కస్కర్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మాలిక్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఉదయం 7 గంటల నుంచి విచారణ చేపట్టారు. ఈ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments